వీఆర్ఏల సమ్మెకు మద్దతు ప్రకటించాలి

Published: Saturday October 01, 2022

మధిర  సెప్టెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధివీఆర్ఏల సమ్మెకు రెవెన్యూ ఉద్యోగులు మద్దతు ప్రకటించి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టాలని వీఆర్ఏల సంఘం కోరారు గురువారం మధిర తహశీల్దార్ రాంబాబును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని 67 రోజులుగా శాంతియుతంగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వీఆర్ఏల సమ్మెకు మద్దతుగా రెవెన్యూ ఉద్యోగులందరూ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి చొరవ చూపవలసిందిగా వారు కోరారు.