మహమూద్ సేవలు మరువలేనివి ** జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి ** మహమూద్ వర్ధంతి సందర్భంగా సేవ కార్య

Published: Monday November 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 27 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఎంఎం హెల్ప్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు , టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి మహమూద్ సేవలు మరువలేనివి అని జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి అన్నారు.ఆదివారం ఎండి మహమూద్ 2వ వర్ధంతి సందర్భంగా ఎంఎం హెల్ప్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  జనకాపూర్ లోని అనాధాశ్రమంలో  పిల్లలకు దుప్పట్లు , పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి, మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫాయాజ్, అబ్దుల్లాలు మాట్లాడుతూ ఎండి మహముద్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుండేవారిని ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజలకు సేవ చెయ్యాలని ఉద్దేశంతోనే ఎంఎం హెల్ప్లైన్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అంతకుముందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  ఎం ఎం హెల్ప్ లైన్ ఫౌండేషన్ ఛైర్మన్ ఎండి అహ్మద్ , డైరెక్టర్ అబ్దుల్ రహమాన్ , టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా , నాయకులు నిసార్ , షబ్బీర్ , సిహెచ్ రవి , మోహన్ గౌడ్ , అమర్ బిన్ అహ్మద్, ఆశన్న, అబ్దుల్ హన్నన్ , శ్యామ్ రావు , సయ్యద్ షౌకత్ ,రాధాకృష్ణ చారి , నజీర్,  తాజ్ , ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
 
*రోగులకు పండ్లు పంపిణీ*
 
ఎం ఎం హెల్ప్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మైనారిటీ నాయకుడు ఎండి మహమూద్ 2వ వర్ధంతి సందర్భంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు , పట్టణంలోని మదర్సా పైజానే ముస్తఫా లో, నూర్ నగర్ లోని మదర్స అరేబియా మదిన తుల్ లుమ్ లో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదర్ సకు 10 కుర్చీలు దానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా , నాయకులు సయ్యద్ నిసార్, ఎండి అహ్మద్ , షబ్బీర్, నజీర్, అర్షద్, హఫీజ్ జాఫర్ సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.