నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం నుండి ఈడి కార్యాలయం ముందు ధర్నా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ శ్

Published: Thursday July 21, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 21న  సోనియాగాంధీ పిలుపుమేరకు  ఈ.డి ఆఫీసుకు విచారణకు వెళ్తున్న సందర్భంగా  కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ రేపు అనగా గురువారం ఉదయం 10:00 గం.లకు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం నుంచి ఈ.డి కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా ఉంది.  ,  ఎంపీ & పిసిసి అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు.కావున మన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి  ఆధ్వర్యంలో నియోజకవర్గం లొని నాలుగు మండలాలు మరియు నాలుగు మున్సిపాలిటీల కి  సంబంధించిన ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు..అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభ్యత్వ ఎన్రోలర్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు