వైభవంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అర్ధ శతాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాలు

Published: Wednesday March 08, 2023
మేడిపల్లి, మార్చి 7 (ప్రజాపాలన ప్రతినిధి) 
రామంతాపూర్ డివిజన్లోని ఇందిరానగర్లో నెలకొన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో అర్ధ శతాబ్ది వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలను ఆలయ కమిటీ,ఈవో, మరియు అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.      ఈ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల్లో స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిధులుగా మంత్రివర్యులు చామకూర  మల్లారెడ్డి సతీసమేతంగా, ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్  మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఈ  కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం సత్య చంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ కోట్ల నరసింహారెడ్డి, ఆలయ సిబ్బంది మురళీధర్ రావు, శంకర్, గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి,చర్లపల్లి కార్పొరేటర్ బొంతూ శ్రీదేవి, మాజీ మేయర్ బొంతూరామ్మోహన్, మాజీ కార్పొరేటర్లు  గంధం జ్యోత్న నాగేశ్వర్ రావు, గొల్లురి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కంచర్ల సోమిరెడ్డి, జె సి బి రాజు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.