సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్

Published: Monday May 10, 2021
మేడిపల్లి, మే9, (ప్రజాపాలన ప్రతినిధి) : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ పేర్కొన్నారు. డివిజన్ కు చెందిన రాములు జగదీశ్వర్ రావు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి 60 వేల రూపాయలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహాయంతో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ మంజూరు చేయించారు. ఈమేరకు కార్పొరేటర్ మంత్రి మల్లారెడ్డి నివాసంలో రాములు జగదీశ్వర్ రావుకు 60 వేల రూపాయల చెక్కును మంత్రి చేతులమీదుగా కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.