మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి

Published: Friday November 04, 2022
బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి డాక్టర్  ఏ.చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 3 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను వికారాబాద్ ఏరీయా ఆస్పత్రిలో పరామర్శించామని మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ అన్నారు. అంతకుముందు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మృతుల కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్లు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయడంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్  జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇంచార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.