ఘనంగా నవ దుర్గా దేవి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం
Published: Friday September 30, 2022
బోనకల్, సెప్టెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో గల శ్రీ షిరిడి సాయిబాబా,నవదుర్గాదేవి ఆలయ ప్రాంగణము నందు దుర్గా దేవి నవరాత్రుల్లో భాగంగా గురువారం అన్నపూర్ణాదేవి అవతారం అమ్మవారు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అవతారంలో భాగంగా మండల కేంద్రంలో గల శిరిడి సాయిబాబా నవ దుర్గాదేవి ఆలయ ప్రాంగమునందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర మోహన్ రావు, చావా వెంకటేశ్వరరావు,పోటువెంకటేశ్వర్లు,నందమూరి సత్యనారాయణ,ఎలగందుల కృష్ణ,మోర్ల శ్రీను, చల్లగొండ శ్రీను, ఎస్.కె రఫీ(పాన్ షాప్), చింత నిప్పు వెంకటేశ్వర్లు, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి,బోజడ్ల రామకృష్ణ, రావుట్ల హరికృష్ణ, యార్లగడ్డ ధర్మ, తదురితరులు పాల్గొన్నారు.
Share this on your social network: