ఆసరా పెన్షన్ కొసం మీ - సేవా కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు

Published: Wednesday August 18, 2021
వికారాబాద్ బ్యూరో 17 ఆగస్ట్ ప్రజాపాలన : 57 సంవత్సరాలు దాటిన వృద్దులు మీ - సేవా కేంద్రాల ద్వారా కొత్త ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సయ్యద్ మహమూద్ అలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ-సేవా కేంద్రాలలో 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ దరఖాస్తు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ-సేవలు లభిస్తాయని తెలిపారు. దరఖాస్తు కొరకు అర్జీదారు తనయొక్క ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాసుపోర్టు సైజు ఫోటో, ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాంక్ ఖాతా నెంబర్, మీ సేవా ద్వారా పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రములు వెంట తీసుకోవెళ్ళాలని సూచించారు. వయసు నిర్ధారణ కొరకు ఓటర్ ఐడి కార్డు, పుట్టిన తేది పత్రము లేదా స్కూల్ సర్టిఫికెట్లతో ప్రామాణికంగా భావిస్తారు. ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకొనే వ్యక్తి బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది కావున దరఖాస్తు దారుడు తప్పకుండ మీ-సేవా కేంద్రానికి రావలసి ఉంటుందన్నారు.  దరఖాస్తు చేసుకొనుటకు గడువు ఈ నెల 31 వరకు మాత్రమే ఉంటుందన్నారు.