తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర
అక్టోబర్ 4ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సీఎల్పీ భట్టి విక్రమార్క విజయ్ దశమి నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎల్పీ భట్టి విక్రమార్కవిజయదశమి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీసీఎల్పీ నేత భట్టి విక్రమార్క దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని వేడుకున్నారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఎప్పటికైనా మంచిదే అంతిమ విజయమని మానవాళికి చాటి చెప్పిందని ఆయన తెలిపారు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందన్నారు.జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Share this on your social network: