కొనసాగుతున్న కాకతీయ కమ్మ సేవా సమితి వారి భోజన కార్యక్రమం

Published: Saturday June 12, 2021
మధిర, జూన్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీసమాజంలో సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరు లో ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ప్రజా వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం తెలిపారు...శుక్రవారం మధిరలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో దాత, కౌన్సెలర్ వంకాయలపాటి బాబు, అనురాధ దంపతులు కరొన భాధితులకు ఏర్పాటుచేసిన భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ వాసిరెడ్డి రామనాథం  చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రంములో కమ్మ సేవా సమితి నేతలు గడ్డం శ్రీనివాసరావు, చెరుకూరు నాగార్జున, చలసాని సుబ్బారావు, నరమనెని అనిల్, మెడ వెంకటేశ్వరావు, వాసిరెడ్డి శ్రీను, కౌన్సిలర్ వీరమాచినేని నాగ సులోచన పాల్గొన్నారు.