ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో వైభవంగా సంక్రాంతి ముగ్గులు

Published: Thursday January 12, 2023
మేడిపల్లి, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి)
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో వైభవంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, చిల్కానగర్, నాచారం డివిజన్లకు చెందిన మహిళలు పాల్గొన్నారు.       ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బొంతు రామ్మోహన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్,

చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు గంధం జోష్న నాగేశ్వరావు, గోళ్ళురి ఆంజయ్య, మేకల అనాల హనుమంత్ రెడ్డి, నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, ముత్యంగారి శివ,జాన్, కాయ హనుమంతు, ప్రేమ్ సాగర్ రెడ్డి, బుత్కురి నవీన్ గౌడ్, జహంగీర్ గౌడ్, రంగ భాస్కర్ గౌడ్, అల్లా బాషా, మొహమూద్, తదితరులు పాల్గొన్నారు.