పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి : బిజెపి

Published: Monday June 28, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం ఆదివారం మండల పరిధిలోని గోకారం గ్రామంలో ఏలే చంద్రశేఖర్ జి గెస్ట్ హౌస్ లో జిల్లా అధ్యక్షులు పి.వీ. శ్యాం సుందర్ రావు ఆధ్వర్యంలో భారత ప్రధాని మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ మన్ కీ బాత్ టీవీ ప్రోగ్రాంలో జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రాబోయే 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కృషి చేయాలని, అంతేకాక మన జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఇంచార్జ్ ఇంచార్జ్ నంద కుమార్ యాదవ్, మాజీ ఇన్చార్జి వేముల నరేందర్ రావు, పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, కర్ణాటి ధనుంజయ, గూడూరు నారాయణరెడ్డి, కడగంటి రమేష్, పడమటి జగన్ మోహన్ రెడ్డి, మోత్కూరు ఎంపీపీ సంధ్యా రాణి నరేందర్, మొగులయ్య, దంతూరి సత్తయ్య, బందారపు లింగ స్వామి, రాచకొండ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు నాగవెల్లీ సుధాకర్, ఏలే చంద్రశేఖర్, బయ్యని చంద్రశేఖర్, గర్డాసు సురేష్, ఏలూరు శ్యామ్, కణతాల అశోక్ రెడ్డి, మంద నరసింహ, వెంకటేశం, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.