వేసంగిలో ఆరుతడి పంటలనే వేసుకోవాలి : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్
Published: Tuesday December 07, 2021
బీరుపూర్/ సారంగాపూర్, డిసెంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం తుంగూర్ సారంగాపూర్ మండలం సారంగాపూర్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. సురేష్ కుమార్ గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వేసంగిలో రైతులు ఆరుతడి పంటలనే వేసుకోవాలని సూచించారు. వరికి బదులు ఆరుతడి పంటలైన నువ్వులు మొక్కజొన్న తదితర పంటలను మాత్రమే వేసుకోవాలని రైతులను కోరారు. ప్రతి రైతు పంటల మార్పిడి తప్పకుండ చేసుకోవని సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరుపూర్ ఏవో అనూష సారంగాపూర్ ఏవో తిరుపతి నాయక్ తుంగూర్ సర్పంచ్ గుడిసె శ్రీమతి గుర్రాల రాజేందర్ రెడ్డి ఏవోలు శిరీష రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: