గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల్లో మధిర ప్రస్థానం
Published: Monday October 17, 2022
మధిర అక్టోబర్ 16 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ వన్ ఫిలిమినరీ పరీక్ష పేపర్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్ జవాబుల్లో ఒకటి మధిర పేరు ఉండటంతో మధిర ప్రాంత ప్రజలు సంతోషానికి అవధలు లేకుండా పోయాయి. గ్రూప్ వన్ పరీక్షల్లో 128వ ప్రశ్నలో ఈ కింది దవాఖానాలో ఏరియా ఆసుపత్రుల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి 2021లో కాయకల్ప అవార్డు పొందినది ఏది? అనే ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో మధిర పేరు ప్రస్తావించడం జరిగింది. పరీక్ష వ్రాసి వచ్చిన మధిర ప్రాంత నిరుద్యోగులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోలు చేయటంతో మధిర ప్రాంత ప్రజలు హర్షాధికేతాలు వ్యక్తం చేస్తున్నారు.
Share this on your social network: