ఈటల రాజేందర్ బర్తరఫ్ కు నిరసనగా ఒకరోజు మౌన దీక్ష

Published: Wednesday May 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిసి సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి తన నివాస గృహంలో మౌన దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలను చిన్నచూపు చూస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రావడానికి కష్ట పడిన వారిని మర్చపోయిందని అన్నారు. అదేవిధంగా ఉద్యమకారులను కూడా చిన్నచూపు చూస్తుందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.