కొత్తపాలెంలో వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన వంగవీటి రాధా

Published: Tuesday October 05, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ర్రుపాలెం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వంగవీటి మోహన రంగా  విగ్రహాన్ని ఆయన కుమారుడు వంగవీటి రాధా ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంలో వంగవీటి రాధా ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు. టీడీపీ నేత, దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంలో రాత్రి నిర్వహించిన మోహనరంగా విగ్రహావిష్కరణ అనంతరం రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్లు చేశారు. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. “నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా  ఉంటారు.” అని రాధా చెప్పుకొచ్చారు. “రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే.. అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు. మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. “ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి.” అని రాధా ఘాటుగా స్పందించారు.