21న ఖమ్మంలో జరిగే చంద్రబాబు సభను విజయవంతం చేయాలిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ

Published: Friday December 16, 2022

మధిర డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం పట్టణంలో ఈ నెల 21న జరగనున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభను విజయవంతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. ఖమ్మం పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ ఏర్పాటుచేసిన ప్రచార రథాలను గురువారం పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లో  పోటీ చేస్తుందన్నారు. టిఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారని ఆయన తెలిపారు. 21వ తేదీన ఖమ్మంలో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు మధిర నియోజక వర్గం నుండి టిడిపి శ్రేణులు భారీ స్థాయిలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అనుమోలు సతీష్  పాల్గొన్నారు.