పీర్జాదిగూడ కార్పొరేషన్లో ఆగస్టు1న బోనాల పండుగ

Published: Thursday July 15, 2021
మేడిపల్లి, జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో బోనాల పండుగను ఆగస్టు1న జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మేయర్  జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పుర ప్రముఖులు, పట్టణ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు మరియు ఆలయ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. పూజారులతో మాట్లాడి పెద్దలందరూ చర్చించి సమిష్టిగా ఆగస్ట్ 1వ తేదీన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగ నిర్వహించుకోవలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమీషనర్ ఎం.శ్రీనివాస్, మేడిపల్లి సిఐ అంజి రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, పట్టణ పెద్దలు, ఆలయ నిర్వాహకులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.