పీర్జాదిగూడలో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దగ్నం చేసిన టీఆర్ఎస్ నేతలు

Published: Friday October 28, 2022
మేడిపల్లి, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వావహణ అధ్యక్షులు, ఐటి& మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక&ఉపాధి కల్పనా శాఖ మంత్రి  చామకూర మల్లారెడ్డి పిలుపుమేరకు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు,  టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మేడిపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (మేయర్ క్యాంప్ కార్యాలయం) వద్ద కేంద్ర బీజేపీ పార్టీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దగ్నం చేయడంతో పాటు నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి,కౌడే పోచయ్య, అనంతరెడ్డి, సుభాష్ నాయక్, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, నాయకులు పప్పుల అంజిరెడ్డి, మనోరంజన్ రెడ్డి, సాయిలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.