ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవం... --ఎమ్మేల్యే డా. సంజయ్, జిల్లా లైబ్రరీ ఛైర్

Published: Saturday July 02, 2022

జగిత్యాల, జూలై, 01 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ బిసి రాయ్ జయంతి, జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ బిసి రాయ్ చిత్ర పటానికి ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేఖర్ గౌడ్ నివాళులు అర్పించినారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులు ఎమ్మేల్యే, జిల్లా లైబ్రరీ ఛైర్మెన్ ను శాలువా కప్పి సన్మానించినారు. ఈ కార్యక్రమంలో సుపెరిందెంట్ రాములు, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డేవిడ్ ఆనంద్, టివివిపి సూపరిందెంట్ సుధక్షిన దేవి, ఓఎస్ డి డా. శశి కాంత్ రెడ్డి, ఆర్ఎంఓ టివివిపి డా. రామ కృష్ణ, ఆర్ఎంఓ చంద్ర శేకర్,వైద్యులు,తదితరులు, పాల్గొన్నారు.