నిరుపేద విద్యార్థులకు సి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో సామాగ్రి అందజేత

Published: Friday July 08, 2022
మల్లాపూర్, జులై 07(ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గ్రామానికి చెందిన సుమారు 20 మంది నిరుపేద విద్యార్థులకు చెన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 25 వేల రూపాయలు విలువ గల పుస్తకాలు పెన్నులు బ్యాగులు తదితర సామాగ్రిని గురువారం చెన్నమనేని శ్రీనివాసరావు ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా చెన్నమనేని శ్రీనివాసరావు ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాల్లో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.