ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఒక వరం --ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Monday December 12, 2022

జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): రూరల్ మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 17 లక్షల 23 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు జగిత్యాల టీఆరెఎస్ పార్టీ కార్యాలయం లో  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. వివిధ రోగాలతో శస్త్ర చికిత్సలు చేసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఒక వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం,  పిఎసిఎస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జాన్,  హెచ్ సిఎ జిల్లా మెంబర్ దావా సురేష్,
ఆత్మ ఛైర్మెన్ రాజిరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసి లు, ఉప సర్పంచ్ లు,ప్రజాప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.