బండి సంజయ్ పాదయాత్ర లో బిసి ఐక్య తను చాటిచెప్పాలి. ...మున్నూరు కాపు సంఘ రాష్ట్ర కార్యదర్శి కాస

Published: Tuesday December 06, 2022
జన్నారం, నవంబర్ 05, ప్రజాపాలన: 
 
ఈనెల 7న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్   నిర్మల్  జిల్లాలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర (పాదయాత్ర) లో అధికసంఖ్యలో  పాల్గొన్ని బిసీల ఐక్యతను చాటుకోవాలని  మున్నూరు కాపు సంఘ రాష్ట్ర కార్యదర్శి కాసెట్టి లక్ష్మణ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో  స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిసీలు జనాభా లో అదికంగా ఉన్నప్పటికీ  రాజ్యాంగ ఫలాలు అనుబవించడంలో వెనకబడి పోయారని పేర్కొన్నారు. రాజ్యాధికారం లో మనవాటా కోసం ఐక్య కార్యాచరణ తో ముందుకు పోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా బీసీ కు సంబంధించిన పలు డిమాండ్ ల తో కూడిన వినతిపత్రం అందజేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఉద్యోగ, నిరుద్యోగ ఉపాధి రంగాలలో వెనుకబడి ఉన్న తాము, చట్టసభలలో ప్రాతినిధ్యం లేనందున అభివృద్ధి లో ఆమడదూరంలో నెట్టివేయబడ్డామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే ఏ నరసింహులు, నారాయణ, చెట్పే ళ్లి గంగయ్య, కోడూరు చంద్రయ్య, మామిడి విజయ్, మూల భాస్కర్ గౌడ్, బట్టల లచ్చన్న గౌడ్, శ్రీపద రమేష్, కడాల నరసయ్య, కోడి చుట్టూ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.