అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన యండిఆర్ ఫౌండేషన్ సభ్యులు

Published: Tuesday June 08, 2021

పటాన్చెరు మాజీ సర్పంచ్ యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు-తులసి లక్ష్మీల వివాహ వార్షికోత్సవం సందర్భంగా లింగంపల్లిలోని అమ్మానాన్న వృద్ధాశ్రమంలో అలాగే అనాధాశ్రమంలో వృద్ధులకు చిన్న పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ మనసున్న మహారాజు, మా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అనాథలకు అండగా నిలిచిన మహనీయులు దేవేందర్ రాజు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మారెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశిషులు ఉండాలని కోరుకున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో యండిఆర్ ఫౌండేషన్ సమన్వయకర్తలు ప్రవీణ్, ప్రణీత్ పాల్గొన్నారు.