బహుజన్ సమాజ పార్టీలో మహిళలు, యువకులు చేరిక

Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి : బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల మహిళా కన్వినర్ ఏర్పుల జ్యోతి ఏర్పాటు చేసిన సమావేశంలో, కాంగ్రెస్, టీఆరెస్ పార్టీ నుండి బి ఎస్ పి లో చేరడం జరిగింది. టీఆరెస్ ప్రభుత్వంలో మా భూములు లాక్కుంటున్నారు, మా పిల్లల చదువిన చదువులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి బహుజన రాజ్యంలో మాత్రమే మాకు, మా పిల్లలకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మెరుగైన విద్యా అందించిన డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తోనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది అని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్, గ్యార మల్లేష్. పార్టీలో చేరి మహిళా కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల కన్వినర్ గా ఏర్పుల ప్రవీణ్ గారిని, ఆనాజ్ పూర్ సెక్టార్ అధ్యక్షుడు గా  ఏర్పుల బాలనర్సింహా గార్లని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ గా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్, మరియు అనాజ్ పూర్ మహిళా మణులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.