కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం ------ చిరగోని లింగస్వామి

Published: Saturday October 29, 2022
చౌటుప్పల్,  అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి):
చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం గ్రామంలో చిరగొని లింగస్వామి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు ప్రచార భాగంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కెసిఆర్ చేసిన పనులను ప్రవేశపెట్టిన సంస్థల పథకాలను ప్రజలకు తెలియజేశారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు అనంతరం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కేవలం టిఆర్ఎస్ పార్టీతోనే అవుతుందని అన్నారు తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులు ప్రజలకు వివరించారు రాజగోపాల్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదని అని అన్నారు కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చిరగోని లింగస్వామి, ఉపసర్పంచ్ అంజిరెడ్డి, జూబ్లీ శివకుమార్, కురుమిద్ద నవ్య, సురుకంటి వెంకటరెడ్డి, సురుకంటి ఓంకార్ రెడ్డి, బొమ్మ కంటి రాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు