నిఘానిడాలో గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష. -ఐదు పరీక్ష కేంద్రాలలో కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాటు.

Published: Monday October 17, 2022
చేవెళ్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రూప్ 1 పిలిమినరి పరీక్ష ఐదు పరిక్ష కేంద్రాలలో నిర్వహించారు. ఉదయం పది 10:30 ప్రారంభమై 1:30 కి ముగిసింది. పోలీసులు పరీక్ష కేంద్రపరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్స్ ను ఉదయాన్నె మూయించమన్నారు. చేవెళ్ళ ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ముగ్గురు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఐదు మంది ఎస్ ఐ లు, మహిళా పోలీస్ లతో సహ మొత్తం 50 మంది విధులు నిర్వహించారని చేవెళ్ళ సి ఐ వెంకటేశ్వర్లు అన్నారు. పరీక్ష కేంద్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం అభ్యర్థులు 1.664 పరీక్ష రాయల్సి ఉండగా 986 మంది  గైర్హాజరయ్యారు. దాదాపు 48 శాంతం అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేరన్నారు. పరీక్ష కేంద్రల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
 
 
 
Attachments area