ఈనెల12న ఐకెపి,విఓఏ,ల రౌండ్ టేబుల్ సమావేశం ** సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ **

Published: Monday April 10, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 12వ తేదీన ఐకెపి,విఓఎ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ ఐకెపి,విఓఎ, లను సేర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు కల్పించాలని ఈనెల 17 నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుందన్నారు. కావున 12 వ తేదీ బుధవారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరై మీ అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి,విఓఏ, ల జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, కోశాధికారి సునీత, మండల అధ్యక్ష కార్యదర్శులు బుద్దు రమ రమేష్, తదితరులు పాల్గొన్నారు.