పసుర గ్రూప్ అధినేత పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేస్తా!

Published: Wednesday February 24, 2021

మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: మధిర లోని శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం లోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట మోహన్ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట మోహన్ తెలిపారు. ఈరోజు వాసవి ట్రస్ట్, మధిర సేవా సమితి ఆధ్వర్యంలో  60 మంది పేదలకు కుట్టు మిషన్లు, గ్రైడర్లు వితరణ చేశారు, ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు. మధిర సేవా సమితి సభ్యులు మాజీ శివాలయం చైర్మన్ కోమటిడి శ్రీనివాస్, మిరియాల కాశి, ఎర్ర లక్ష్మణ్, షేక్ జాంగిర్, బసవరాజు వాసుదేవరావు (అడ్వకేట్)జంగా నర్సిరెడ్డి, ఇరుకుల్ల లక్ష్మీ నరసింహారావు కురువెల్ల కృష్ణ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు