నిరంతరం ప్రజా శ్రేయస్సుకై పోరాడిన నాయకుడు నల్లమల్ల

Published: Wednesday May 25, 2022

 బోనకల్, మే 24 ప్రజాపాలన ప్రతినిధి: పేదల ప్రజల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేసిన మహానీయుడు నల్లమల్ల గిరిప్రసాద్ అని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు కొనియాడారు. మండలంలోని రాయన్నపేట గ్రామంలో మంగళవారం 25వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యం గల ఆనందరావు మాట్లాడుతూ.. అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా నల్లమల్ల గిరిప్రసాద్ నాయకుడిగా పార్టీ నిర్మాణంలో అవిరామంగా కృషి చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గిరిప్రసాద్ పాత్ర ప్రత్యేకమైనదన్నారు. ఆయన జీవిమంతా ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తూము రోషయ్య, కొంగర రామారావు,ఏలూరి పూర్ణచంద్, మరీదు ఈశ్వరమ్మ, మరీదు వెంకటేశ్వర్లు, తోటపల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.