అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

Published: Wednesday March 23, 2022
పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 22 మార్చి ప్రజాపాలన : చివరిమజిలీ (అంత్యక్రియలకు) కి ఆర్థిక సహకారం అందించామని పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామ గ్రామంలో అనారోగ్యంతో ఇటీవల మరణించిన కోటపల్లి మాణెమ్మ మృతి చెందింది. గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ సూచన మేరకు మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజే అందజేశామని పేర్కొన్నారు. అట్లాగే మ్యాతరి రాసమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలను దినవారం ఖర్చులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవర దేశి అశోక్, తెరాస మండల యూత్ అధ్యక్షులు మోరంగపల్లి సురేష్, పార్టీ గ్రామ అధ్యక్షులు జి. అశోక్, మాజీ ఎంపీటీసీ బి. రవి, డీలర్ మోహన్, డీ. ప్రభాకర్, వార్డ్ మెంబర్ నర్సిములు, తెరాస నాయకులు నర్సిములు, లాజర్, దేవయ్య, లక్షమయ్య, యేసు పాల్గొన్నారు.