డివిజన్ లోని వర్ష ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన మాజీ కార్పొరేటర్ శేషుకుమారి

Published: Wednesday July 13, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
 గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో  అమీర్ పేట్ డివిజన్ లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలలో అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి విస్తృతంగా పర్యటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఆమె అమీర్ పేట్ డివిజన్  అధ్యక్షులు ఎం.హనుమంతరావు
పార్టీ నాయకులు, కార్యకర్తలతో  కలిసి గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ  అమీర్ పేట్ డివిజన్ లొని గంగుబాయ్ బస్తి , బుద్ధ నగర్ తదితర బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ కూడావర్ష ప్రభావిత బస్తిలలో, కాలనీలలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో శేషుకుమారి తోపాటు సీనియర్ నాయకులు సత్యనారాయణ యాదవ్, కట్ట బలరాం, గొలుసుల సత్యనారాయణ, పొడుగు శ్రీనివాస్, కూతురు నరసింహ, వనం శ్రీనివాస్, గోసు శ్రీనివాస్, లక్ష్మి, శ్రీలక్ష్మి,రాజుముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.