దేవరపల్లి వెంకట పిచ్చమ్మ సేవలు మరువలేనివి
Published: Friday February 04, 2022
మాజీ ఎంపీ పొంగులేటి
మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు సీనియర్ లాయర్ దేవరపల్లి సుబ్రహ్మణ్యం గారి తల్లివెంకట పిచ్చమ్మ సేవలు మరువలేనివని మాజీ ఎంపీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రముఖ సీనియర్ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇటీవల దేవరపల్లి సుబ్రహ్మణ్యం మాతృమూర్తి వెంకట పిచ్చమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈరోజు దేవరపల్లి సుబ్రమణ్య కుటుంబాన్ని పరామర్శించి వెంకట పిచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి జిల్లా నాయకులు కోటా రాంబాబు యన్నం కోటేశ్వరావు దేవిశెట్టి రంగారావు పల్లపోతు ప్రసాదరావు రేగళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: