ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఘన సన్మానం.. మణుగూరు మండలం ప్రజా

Published: Tuesday October 11, 2022
సింగరేణి కాలేజ్ ఏరియా ముస్లిమ్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (SMEWA) మరియు మహమ్మదీయ మజీద్ కమిటీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో   ఏరియాలో వివిధ గనులు డిపార్ట్మెంట్లలో  సింగరేణి ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన సయ్యద్ మోహినుద్దీన్ (వెహికల్ డ్రైవర్ ఓసీ-2 బ్లాస్టింగ్ సెక్షన్) మహమ్మద్ రఫీ (డ్రిల్ ఆపరేటర్ ఓసి-2) షేక్ యాకుబ్ అలీ జూనియర్ అసిస్టెంట్ (కొండాపురం CSP) జాఫర్ ఓసి-2 డోజర్ సెక్షన్) ఇద్రీస్ అహ్మద్ (సెక్యూరిటీ గార్డ్ జిఎం కార్యాలయం) లను శాలువా పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు వారు చేసిన సేవలను మరియు సింగరేణి ముస్లిమ్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వారు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. వారి విశ్రాంతి జీవితం ఆనందమయం కావాలని ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతుడు వారిని వారి కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ముస్లిమ్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మహమ్మదీయ మజీద్ కమిటీ సభ్యులు సభ్యులు షేక్ అబ్దుల్ రవూఫ్, ఎండి అమీన్, ఎండి హబీబ్, మహమ్మద్ షాబుద్దీన్, కలీం పాషా, అమానుల్లా,ఎండీ షబ్బీర్ పాషా, అన్వర్ బేగ్, యూసఫ్, గఫార్ ,పర్వేజ్, నూర్ అహ్మద్ ఎం డి ఎస్ బాబా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.