రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు

Published: Friday May 07, 2021
బాలపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి జన్మదిన పురస్కరించుకొని కార్యకర్తలందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లో కార్పొరేటర్ దోమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్  ఆధ్వర్యంలో ప్రగతి హిల్స్ పార్క్ లో  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్  తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్స్ కలిసి సబితమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, నిరుపేదలకు పండ్లు పలహారాలు పంచిపెట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రజలందరు మాస్కులు, భౌతిక దూరాలు  పాటించాలని జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్  సిద్ధాల బీరప్ప, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ వీరరాఘ రెడ్డి, రాచల్ల ప్రవీణ్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.