ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్

Published: Monday August 22, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధిఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆదివారం ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరిసర ప్రాంత ప్రజలు ఇదివరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని, నేటి నుంచి ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని, కావున ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఆధార్ కేంద్రం నిర్వాహకులు ఎన్. నర్సింహ మాట్లాడుతూ.బయోమెట్రిక్, ఫోటో చేంజ్, పేరు, అడ్రస్, జెండర్, మొబైల్ నెంబర్, చైల్డ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ వంటి సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నారణి మౌనిక సుధాకర్, కొప్పు కృష్ణంరాజు, ఆదిభట్ల మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, గ్రామ అధ్యక్షుడు నారణి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.