పోడు భూములపై గ్రామాల్లో కాస్తుదారులకు ఆర్డీవో మాధురి అవగాహన సదస్సు...

Published: Thursday November 11, 2021
బీరుపూర్, నవంబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో పోడు భూములపై ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి పోడు భూములపై ఉన్న కాస్తుదారులకు ఆర్డీవో మాధురి అవగాహన కల్పించారు. గ్రామాల్లో 2005 సంవత్సరం నుండి పోడు భూముల కాస్తులో ఉన్న లబ్ధిదారులు ఎంత భూమి కాస్తూ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి ఎంత ఏరియాలో కబ్జలో ఉన్నారు. భూమి సర్వే నంబర్ తదితర వివరాలను అప్లికేషన్ ఫారంలో పొందపర్చలని ఆర్డీవో సూచించారు. కాస్తూదారులు మొఖపై ఎంత సాగు చేస్తున్నారు. కాస్తులో ఉన్నార లేద అనే వివరాలు తెలుసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి గ్రామ రెవెన్యూ అధికారి తదితరులు కాస్తులో ఉన్న లబ్ధిదారుల వివరాలను తెలుసుకోవడాకి పర్యటిస్తారని గ్రామస్తులకు మాధురి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరిఫోద్దీన్ గ్రామ సర్పంచ్ రిక్కల ప్రభాకర్ కోలుముల రమణ మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఎంపీటీసీ ఎడ్ల సృజన ఎఫ్ఆర్ఓ పద్మ ఉప సర్పంచ్ ఆవునురీ సతవ్వ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.