ప్రతి గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ఉండాలి
Published: Thursday April 29, 2021
తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేసిన బీజేపీ నేతలు
మల్లాపూర్, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మల్లాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షలు ముద్దం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి బుధవారం తహశీల్దార్ రవీందర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్దారణ పరీక్షలు మరియు కరోనా వ్యాక్సినేషన్ రెండు ఒకే చోట నిర్వహించడం జరుగుతుంది. అలా రెండు ఒకే చోట కరోనా కు సంబంధించిన కేంద్రాలు ఉండటం వలన ఆసుపత్రికి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని ప్రజలకు కరోనాతో ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయటం వలన ప్రజలకు ఎంతో శ్రేయస్కరం గా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, టౌన్ అధ్యక్షులు లవంగా శివ కుమార్, ముత్యాల రాకేష్, నాగుల నవీన్ కుమార్, గడ్డం నవీన్ రెడ్డి, కొండా రాజశేఖర్, డాక్టర్ రాజారాం, అల్లిరెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: