కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు

Published: Thursday July 28, 2022

కోరుట్ల, జూలై 27 (ప్రజాపాలన ప్రతినిధి):
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారము రోజున కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణంలోని మొత్తం 40 మంది లబ్ధిదారులకు (40,29,669) రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు,ఎంపీపీ తోట నారాయణ గారు,కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్  మరియు ఇతర కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎమ్మార్వో, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.