మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎడ్ల కృష్ణయ్య నియామకం
Published: Wednesday October 06, 2021
హైదరాబాద్, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎడ్ల కృష్ణయ్య నియామకం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నాడు బంజారాహిల్స్ లోని మాల మహానాడు ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అధ్యక్షతన జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎడ్ల కృష్ణయ్య ను మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. తదుపరి జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య నియామక పత్రాన్ని కృష్ణయ్యకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించినందుకు తప్పకుండా సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కృష్ణయ్య హామీ ఇచ్చారు. మరియు తనను అధికార ప్రతినిధిగా నియామకం చేసి అదనపు బాధ్యతలు ఇచ్చినందుకు పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కావాలి రమేష్, రాష్ట్ర కార్యదర్శి కావలి హనుమంతు, యూత్ ప్రెసిడెంట్ జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: