బాల్క సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్

Published: Tuesday June 08, 2021

బెల్లంపల్లి, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల అకాల మృతి చెందిన బాల్క సురేష్ మృతి తెరాస పార్టీ కి వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అన్నారు. సోమవారం నాడు సురేష్  స్వగ్రామమైన మెట్ పెల్లి జిల్లా రేగుంట గ్రామంలో తన స్వగృహంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్క సురేష్ తెరాస పార్టీ కోసం రాష్ట్ర ఏర్పాటులో ఎనలేని సేవలు చేశారని ఆ సేవలకు గుర్తింపుగా మెట్ పెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో రేణికుంట్ల ప్రవీణ్ తో పాటు బెల్లంపల్లి పట్టణ టీబీజీకేఎస్ నాయకుడు కానుగంటి కుమారస్వామి, తెరాస సీనియర్ నాయకులు బంక రమేష్, తాటికొండ చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.