ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాటర్ ఫిల్టర్ అందజేత

Published: Tuesday May 11, 2021
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం రోజున మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి సమక్షంలో ఏలూరి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ వారు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు, ఆ సంస్థ ప్రతినిధులు నాగేశ్వర రావు, స్వామి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు నీళ్ల ఇబ్బందులు పడకుండా, వేసవిలో  వారి దాహం తీర్చడానికి మా ఎల్లూరి పరిశ్రమ ద్వారా అందచేశమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకట రమణ, సూపర్ వైజర్ సమీ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..