విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి

Published: Friday December 02, 2022
టి బి ఎస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు రూ.3000 కోట్లు వెంటనే చెల్లించాలని, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జిలను నెలకు రూ.1500నుండి రూ.3000 వరకు పాఠశాల హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జిలను నెలకు రూ.1100 నుండి రూ.2500 వరకు పెంచాలని. గురుకుల పాఠశాలలకి స్వంత భావనలు నిర్మించాలని డిమాండ్ చేశారు, సంక్షేమ వసతి గృహాలను స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయ మంచిర్యాల ఇన్చార్జ్  ప్రశాంత్, విజయ్, యశ్వంత్, పవన్, అజయ్ శ్రీధర్, సాయి, రాకేష్, శివ,తదితరులు పాల్గొన్నారు.