శిధిలావస్థలో కేశవపట్నం చేపల కేంద్రం భవనం
Published: Wednesday January 25, 2023
శంకరపట్నం జనవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం పెద్ద చెరువు వద్ద గల చేపల కేంద్రం భవనం శిధిలావస్థలో ఉంది. ఈ భవనాన్ని నిర్మించి రెండు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ కొత్త భవనాన్ని మత్స్య శాఖ వారు నిర్మించకపోవడంతో శిధిలావస్థలో ఉన్న ఈ భవనంలోనే చేపల కేంద్రం కార్యాలయ సిబ్బంది వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Share this on your social network: