ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ ◆ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్
Published: Monday July 04, 2022
జగిత్యాల, జూలై 03 ( ప్రజాపాలన ప్రతినిధి): వెలమ సంక్షేమ మండలి అధ్వర్యంలో చదువులో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఉపకార వేతనాలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమం లో పద్మనాయక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కెడిసిసి మెంబర్ రామ్ చందర్ రావు, సీనియర్ టీఆరెఎస్ నాయకులు రమణ రావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు, జిల్లా రైతు బందు మెంబర్ దామోదర్ రావు, రాజేశ్వర్ రావు, వసంత రావు, పద్మనాయక సంక్షేమ మండలి కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: