ఇదేనా మన పట్టణ ప్రగతి సంక్షేమ కార్యక్రమం

Published: Tuesday July 06, 2021
మధిర, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లో చెత్త పెరిగిపోయిన దృశ్యం ఇది. గత వారం రోజులుగా మునిసిపాలిటీ సిబ్బంది వారి చెత్తను సేకరించే వాహనములు రాకపోవడం వలన, వార్డు లో ఉండే కొంతమంది ప్రజలు వారి యొక్క ఇంటి చెత్తను ఈ ప్రదేశంలో వేస్తున్నారు. దీని మూలాన వివిధ సీజనల్ వ్యాధులమలేరియా డెంగ్యూ టైఫాయిడ్ etc వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావున చెత్త వేసే వారిని కనుగొని వారికి జరిమానా విధించ వలసిందిగా కోరుతున్నాము. ఇలా మరోసారి జరగకుండా చెత్త బండ్లను ప్రతిరోజు ప్రతి వీధికి పంపవలసిందిగా ప్రజల విజ్ఞప్తి చేశారు