హెల్త్ వాలంటీర్స్ ధన్యవాద్ ప్రాణదాత విజయవంతం

Published: Thursday June 16, 2022
కష్ట సమయాల్లో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనిది:
శీలం పాపారావు, కొలిపాక శ్రీదేవి
 
బోనకల్, జూన్ 15 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ఆర్ఐ, భారతీయ జనతా పార్టీ యువనేత బీపీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ వాలంటీర్స్ ధన్యవాద్ ప్రాణదాత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా హెల్త్ వాలంటీర్స్ చైర్మన్ శీలం పాపారావు పాల్గొని కరోనా విపత్కర సమయంలో విశిష్ట సేవలందించిన వైద్యులను, నర్సులను ఆశా వర్కర్లు లను మరియు ఇతర వైద్య సిబ్బందిని శాలువాతో సత్కరించి పూల మొక్కలను బహుకరించారు. అనంతరం జిల్లా హెల్త్ వాలంటీర్స్, కో ఇంచార్జ్ లు కొలిపాక శ్రీదేవి, బొళ్ళ బిక్షపతి లతో కలిసి నరేంద్ర మోడీ సందేశాత్మక ప్రశంసాపత్రాన్ని సిబ్బందికి అందజేశారు. శీలం పాపారావు, కొలిపాక శ్రీదేవి లు మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ ఫ్రెండ్ లైనర్ సిబ్బంది కాళ్లను కడిగి సన్మానించుకునే విధానంలో ముందున్నారని, వైద్య సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి, ఎంతోమంది ప్రాణాలు కాపాడి బ్రహ్మ తర్వాత బ్రహ్మ స్థానంలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుగులోతు నాగేశ్వరరావు, జంపాల రవి, తాళ్లూరి సురేష్, కాలసాని పరుశురాం, బంధం నాగేశ్వరరావు , ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.