ఎంటమాలజీ సిబ్బందికి డ్రై ఫ్రూట్స్ పంపిణీ

Published: Tuesday May 18, 2021
మేడిపల్లి, మే17 (ప్రజాపాలన ప్రతినిధి) : మన ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఎంటమాలజీ విభాగం ఉప్పల్ సర్కల్ పరిధిలోని సిబ్బందికి  డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అథితిగా ఉప్పల్ సర్కిల్ ఉప కమిషనర్ అరుణ కుమారి హజరయ్యారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టడంలో పారిశుద్ధ్య కార్మికులు, ఎంటమాలజీ సిబ్బంది పాత్ర కీలకమైనదని అన్నారు. కరోనా వారియర్స్ కోసం మన ఫౌండేషన్ సోసైటీ చేస్తన్న సేవలను ఆమె కొనియాడారు. మన ఫౌండేషన్ సౌసైటీ అధ్యక్షుడు మేకల సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇమ్మునిటీ పెంచేందుకు ఫౌండేషన్ తరపున డ్రైఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న సిబ్బందికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ సోసైటీ ఉపాధ్యక్షులు టి.మహేష్ కుమార్, ఎన్నమల్ల శ్రీనివాస్, మద్దెల ఛంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి నీరంకి రవి, కార్యదర్శి బిక్షపతి, కృష్ణ ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.