శివరాంనగర్ పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
Published: Saturday December 03, 2022
కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజా పాలన : నియోజకవర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించేటట్లు దీవించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందులు స్వామి శరణం అయ్యప్పను వేడుకున్నారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరాం నగర్ కాలనీకి చెందిన 32 వ వార్డుకు చెందిన మాలే గాయత్రీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 మెట్లతో అతి సుందరంగా అలంకరించిన అయ్యప్పను భక్తి ప్రపత్తులతో భక్తులు ఆరాధించారు. ప్రత్యేక పూజా సామాగ్రితో స్వాములు స్వామియే శరణమయ్యప్ప అనే ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు.
Share this on your social network: