*కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.* *కొందుర్గు మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్*

Published: Tuesday January 10, 2023
 *ప్రజా పాలన కొందుర్గు :- **తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 2వ దశ కంటి వెలుగు కార్యమాన్ని విజయవంతం చేయుటకు మండల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు ఆరోగ్య శాఖ సిబ్బంది తో సమన్వయం చేసుకుని, గ్రామాలలో ఈ కార్యక్రమానికి అవసరమైన సదుపాయాలు కల్పించి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ 
కొందుర్గ్ మండలంలో ఈ నెల 18 తేదీ నుండి ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమం మొదటగా కొందుర్గ్ గ్రామంలో 25 రోజుల పాటు ఉంటుంది. కావున గ్రామ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు*
 
ఈ కార్యక్రమంలో ఆంజనేయులు ఎంపీడీఓ,లాలయ్య ఎంపీవో , సర్పంచ్ లు శ్రీధర్ రెడ్డి,నర్సింహ రెడ్డి,బాలరాజు,నర్సింలు,పవిత్ర దేవి,శేఖర్,మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు